వరద విపత్తుతో విలవిలలాడుతున్న కేరళ రాష్ట్రానికి మంచినీటిని సరఫరా చేసేందుకు రైల్వేశాఖ ముందుకు వచ్చింది.
2,740 కార్టన్ల మంచినీటిని పారశాల రైల్ నీర్ ప్లాంటు నుంచి గూడ్సు రైలులో కేరళ రాష్ట్రానికి తీసుకువెళ్లారు.
ఈరోడ్ జంక్షన్ నుంచి 2.8 లక్షల లీటర్ల మంచినీటిని ఏడు రైల్వేవ్యాగన్లతో కేరళకు తీసుకువెళ్లారు.
మరో పదివేల బాక్సుల మంచినీటి బాటిళ్లను వరదపీడిత ప్రాంతానికి తరలించాలని రైల్వేశాఖ అధికారులు నిర్ణయించారు.