Grand Daughter Did Final Funeral Rituals to her Grandfather,Himachal nagar,Visakhapatnam,Vizag Vision..కన్న తండ్రికి తలకొరివి పెట్టి పున్నామ నరకం నుండి తప్పించాల్సిన కన్న కొడుకే కసాయిగా వ్యవహరించి సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన తీరు పారిశ్రామిక ప్రాంతం 47 వ వార్డు పరిధిలోని హిమాచల్ నగర్ లో చోటుచేసుకుంది. చివరికి మృతుని చిన్నకొడుకు కుమార్తె తాతకు దహన సంస్కరలు నిర్వహించి రక్త బంధం ఉదరతను చాటుకుంది.స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హిమాచల్ నగర్ కాలనీ లో మృతుడు కృపానందం కుటుంబంతో నివాసిస్తున్నాడు.మృతునికి ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు విదేశాలకు పనికి వెళ్ళాడు.పెద్దకుమారుడు వద్ద తండ్రీ కృపానందం ఉంటున్నాడని అయితే గత రాత్రి తండ్రి మృతి చెందగా దహన సంస్కారాలు నిర్వహించాల్సిన మృతుని పెద్దకుమారుడు అప్పారావు అందుకు ససేమిరా అంటూ తను మతం మార్చుకున్ననాని దహన సంస్కారాలు చేయడానికి తన మతం ఒప్పకోదంటూ.తండ్రి మృతదేహాన్నీ ఇంటి బయట విడిచి పెట్టేసాడు.దింతో చేసేదేమిలేక పలువురూ దహణసంస్కరలు చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా మృతుని మనుమరలు ముందుకు వచ్చి తాతకు తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది.దహణసంస్కరలు నిర్వహించేందుకు పి. వి. ఎస్ హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పి. వి సురేష్ ఇతర సభ్యులు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.