విజయవాడ రైల్వే లోకో ఫ్యాక్టరీలో వినూత్న ప్రయోగం రైల్ ఇంజన్లను గూడ్స్ రైళ్లకు ఉపయోగ పడే విధంగా తయారు Vizagvision…
విజయవాడ రైల్వే లోకో ఫ్యాక్టరీలో వినూత్న ప్రయోగం…
కోవిడ్ కారణంగా నిలిచిపోయిన రైళ్ల స్థానంలోని రైల్ ఇంజన్లను గూడ్స్ రైళ్లకు ఉపయోగ పడే విధంగా తయారు చేసిన రైల్వే సిబ్బంది…
రెండు రైల్ ఇంజన్లను అనుసంధానం చేసి, వాటి సామర్ధ్యాన్ని పెంచి గూడ్స్ రైళ్లకు వాడే విధంగా తయారీ…
దక్షిణ మధ్య రైల్వే సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ దినేష్ రెడ్డి కామెంట్స్
కోవిడ్ కారణంగా నిలిచిపోయిన రైలు ఇంజన్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి…
ఈ సమయంలో రైల్వే కు ఆదాయం పెంచే దిశగా రెండు ఇంజన్లు కలిపి సాంకేతిక పరిజ్ఞానంతో గూడ్స్ రైల్ నడిచే విధంగా లోకొలను తయారు చేశాము…
60 ఇంజన్లకు గాను రెండు రైల్ ఇంజన్లను ట్రయిల్ రన్ గా తయారు చేసి రేణి గుంట పంపించాము…
దక్షిణ మధ్య రైల్వే జీఎం, డీఆర్ఎం సహకారం తో ఈ తరహా ప్రయోగం చేయగలిగాము…
మొత్తం 12 మంది సిబ్బంది భాగస్వామ్యం ఇంజన్ల ఆధునీకరణ చేశాము..
ట్రయిల్ రన్ పరిశీలించి మిగతా 60 ఇంజన్లను ఇదే తరహాలో ఉపయోగిస్తాము
*భారతదేశం లో మొట్టమొదటి సారిగా ఈ తరహా ప్రయోగం చేసింది విజయవాడ లోకో ఫ్యాక్టరీ సిబ్బంది…
వీరికి త్వరలో నగదు పురస్కారాన్ని అందిస్తాము.