స్వర్గీయ పూర్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి భక్త మార్కండేయ ట్రస్ట్ పద్మశాలిభవన్ ప్రగాఢ సంతాపం
స్వర్గీయ పూర్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, దేశానికి ఆయన చేసిన సేవలు మరువ లేనిదని, ఆయన మృతి దేశానికే తీరని లోటని శ్రీ భక్త మార్కండేయ ట్రస్ట్, పద్మశాలి భవన్ అధ్యక్షులు కులుపాక సన్యాసిరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం శంకర మఠం రోడ్ లో ఉన్న పద్మశాలి భవన్ సమావేశ మందిరంలో చేనేత సమాచార్ మాస పత్రిక సంపాదకులు ఏ.వి.వి.ఎస్ మూర్తి( బాదంగిర్ సాయి) అధ్యక్షతన సంతాప సమావేశం నిర్వహించారు. స్వర్గీయ పూర్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి నివాళులు అర్పిస్తూ ట్రస్టు సభ్యులు కొద్ది నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా
కులుపాక సన్యాసిరావు మాట్లాడుతూ
ప్రణబ్ దాదా’గా సన్నిహితులు ఆత్మీయంగా పిలుచుకొనే 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ భారత రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో ఒకరని, యాభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడారు. కాంగ్రెస్లో వివాద పరిష్కర్తగా పేరు పొందారని తెలియజేశారు.
కాకలు తీరిన రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయిందని, 6 దశాబ్దాల రాజకీయ చరిత్రలో వివాదరహితుడన్నారు. భావితరాలకు మార్గదర్శకుడు, ఆదర్శప్రాయుడని చెప్పారు. ఆయన నిరాడంబరత, నిబద్దత, నిజాయితీ అందరికీ మార్గదర్శకమన్నారు. భారత ఆర్ధిక విధానాలు, రక్షణ విధానాల రూపకల్పనలో, దేశీయ, విదేశీ వ్యవహారాల రూపకల్పనలో ప్రణబ్ కృషి గొప్పదని తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికే తీరనిలోటని, ఆయన సేవలు సదా స్మరణీయమన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ భక్త మార్కండేయ ట్రస్ట్, పద్మశాలి భవన్ ఉపాధ్యక్షులు ఆలేటి కృష్ణారావు, టి. వెంకటేశ్వర్లు, వానపల్లి రవి కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి ఇమంది రమణ, కార్యనిర్వాహక సభ్యులు కోడి దాసు శ్రీనివాసరావు, బురిడి కళ్యాణి, అయ్యాంకల శ్రీనివాస్, ఆడారి తరుణ్ కుమార్, ప్రసాదుల అరుణ్ కుమార్, శ్రీనివాసు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.