పౌరసత్వ సవరణ చట్టం వెంటనే రద్దు చేయాలి CAB,NRC బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన ర్యాలీ in Vijayawada,Vizagvision…
పౌరసత్వ సవరణ చట్టం వెంటనే రద్దు చేయాలి….
దేశ రాజ్యాంగాన్ని ప్రేమించే భారతీయులు కదిలిరావాలి.
పౌరసత్వ సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అల్ మైనారిటీ అసోసియేషన్ నెట్ వర్క్(అమన్) ఆధ్వర్యంలో శుక్రవారం జిమ్ ఖాన గ్రౌండ్ నుండి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిమ్ ఖాన గ్రౌండ్ లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా అసోసియేషన్ కన్వీనర్ షేక్. అహ్మద్ మాట్లాడుతూ 70 ఏళ్లుగా భారత్లో పౌరులు ఐకమత్యంగా ఉంటున్నారని, ఈ చట్టం తేవాల్సిన అవసరం ఏముందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చట్టం తో భారత్లో బీజేపీ అలజడి సృష్టిస్తోందని అన్నారు. పౌరసత్వం విషయంలో ఇన్నేళ్లుగా ఏ సమస్యా లేదని, ఇప్పుడు కొత్తగా ఏం సమస్య వచ్చిందో చెప్పాలన్నారు.మతం ఆధారంగా పౌరసత్వాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎప్పటికి భారత్ లౌకిక దేశంగానే ఉంటుందని చెప్పారు. బిజెపి చేసిన చట్టం ముస్లింలకు వ్యతిరేకమైందని ఆయన చెప్పారు.. రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ మన దేశాన్ని బీజేపి, ఆర్ఎస్ఎస్ నుండి కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పౌరసత్వ సవరణ చట్టం మన రాష్ట్రం అమలు చేయబోమని ప్రకటించారు, ప్రకటన కన్న అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ తో పాటు నారా చంద్రబాబు, ఇతర పార్టీలు కూడా ఈ చట్టం రద్దు చేసే వరకు కేంద్రంతో పోరాటం చేయాలని, తమ వెంట రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి భారతీయుడు ఉంటాడని తెలిపారు. అనంతరం 200 మీటర్ల జాతీయ జెండాను చేత పట్టుకొని బీఆర్టిఎస్ రోడ్డు మీదుగా ధర్నా చౌక్ వరకు ముస్లిం సోదరులు శాంతియుతాంగా ర్యాలీ గా వెళ్లారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసెండెంట్ హాబీబుల్ రహేమాన్, కో.కన్వీనర్ అబ్దుల్లా, జాయింట్ సెక్రటరీ అత్తావుల్లా, స్టూడెంట్స్ రింగ్స్ ఇస్మాయిల్, నగరంలోని స్క్రాప్ మార్కెట్, టైర్ మార్కెట్, ఫిష్ మార్కెట్, ఓల్డ్ వుడ్ మార్కెట్, బేరింగ్ మార్కెట్, గోల్డ్ మార్కెట్ ల అసోసియేషన్ సభ్యలు, ముస్లిం హక్కుల పోరాటాల సమితి అధ్యక్షుడు ఫారూఖ్ షోబ్లీ హాజరయ్యారు..