Mr,Mrs & Miss Magnifique India Awards-19 “Elixir Miss India (South)” to Miss-Babitha Palla in Visakhapatnam,Vizagvision…ఢిల్లీలో డిసెంబర్ 1న జరిగిన మిస్ సౌత్ పోటీల్లో విశాఖ నుంచి ప్రాతినిథ్యం వహించిన బబిత పల్ల ఎంపికయ్యారు. ఆ వివరాలను స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బబిత వెల్లడించారు. 30 మంది పోటీ పడ్డ మిస్ సౌత్ కాంపిటీషన్ లో తాను ఎంపికై అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్రమశిక్షణతో కూడిన పట్టుదల, తల్లిదండ్రులు స్నేహితుల ప్రోత్సాహం తన విజయానికి పడ్డాయి అని చెప్పారు. దీంతోపాటు ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎన్విరాన్మెంట్ సమ్మిట్ కు తనను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. సమాజానికి సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకెళ్తున్న తనకు మరింత బాధ్యత పెరిగింది బబిత చెప్పారు. ఈ సమావేశంలో మను పల్ల, రాజస్థాన్ మహిళా మండలి అధ్యక్షురాలు వినీత, వే ఫౌండేషన్ స్వామి, బీసీ నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు