క్రషర్ వద్దు అంటూ ఆందోళనకు దిగిన గ్రామస్తులు in Anakapalle,Visakhapatnam..క్రషర్ కాలుష్యం కారణంగా గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని అనకాపల్లి మండలం వూడేరు గ్రామస్తులు ఎన్ ఇ సి క్రషర్ వద్ద ఆందోళనకు దిగారు. ఎన్ఈ సి క్రషర్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా క్రషింగ్ చేయడంవల్ల గ్రామంలోని గాలి నీరు కాలుష్యం మై గ్రామస్తులు కిడ్నీ రోగాలకు గురి అవుతున్నారని అన్నారు గ్రామంలోని ఎన్ ఇ సి క్వారీ పేలుళ్ల కారణంగా ఇల్లు బీటలువారి శిథిలావస్థకు చేరుకున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో రైతులు వ్యవసాయానికి వేలకు వేలు పెట్టుబడులు పెట్టినప్పటికీ కాలుష్యం కారణంగా పంటలు చేతికి అందడం లేదని ఆందోళన చెందుతున్నారు ఇక్కడి నుంచి వచ్చే కాలుష్యం కారణంగా పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కిడ్నీ సమస్యలతో పాటు ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారని అన్నారు అంతేకాకుండా వేలకు వేల టన్నులు అనధికారికంగా తరలించుకు పోతున్నారని ఆరోపించారు తక్షణం ఎన్ఈసీ క్రషర్ పై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశా