నగరంలో రెండు రోజుల రెండు పర్యటన నిమిత్తం బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం లో మంగళవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వ ఉన్నతాధికారులు , బిజెపి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో కొంతసేపు బిజెపి పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. విమానాశ్రయం నుంచి నేరుగా నగరంలోని పిఠాపురం కాలనీ లో గల బిజెపి సీనియర్ లీడర్ పీవీ చలపతిరావు గృహాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. అక్కడ నుంచి ఋషికొండ ఏవన్ గ్రాండ్ కన్వెన్షన్ జరగనున్న ఆత్మీయ సమావేశం లో పాల్గొని. అనంతరం నగరం లోని కార్యక్రమాలు ముగించుకొని రాత్రికి సర్క్యూట్ హౌస్లో బస చేస్తారని. మరుసటి రోజు బుధవారం రెండో రోజు కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపారు.