నేడు గుజరాత్ పర్యటనకు విచ్చేసిన మోదీ
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
అమ్మ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన 69వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించారు.
ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ మధ్యాహ్నం గాంధీనగర్ కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా తన తల్లి హీరాబెన్ ఇంటికెళ్లిన ప్రధాని, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం ఇద్దరూ కలిసి గుజరాతీ భోజనం చేశారు. ఆ తర్వాత తల్లి హీరాబెన్ ఆరోగ్యం, యోగక్షేమాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొద్దిసేపు తల్లితో ముచ్చటించారు.
ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.