DMK Chief M Karunanidhi Funeral Rest at Marina Beach,Chennai,,Vizagvison..తమిళ ప్రజల ఆరాధ్యనేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంతిమయాత్ర,
రాజాజీహాలు నుంచి వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం, శివానంద రోడ్, తంతైపెరియార్ రోడ్ మీదుగా మెరీనా బీచ్ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది.
మెరీనా బీచ్లోని మాజీ సీఎం అన్నాదురై స్మారక కేంద్రం సమీపంలో అన్నా స్క్వేర్ ప్రాంగణంలో సాయంత్రం 5గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
బంగారుపూత పూసిన శవపేటికలో కరుణానిధి పార్థీవ దేహాన్ని ఖననం చేయనున్నారు.
‘విరామం ఎరుగకుండా శ్రమించిన నాయకుడు.. ఇదిగో విశ్రమిస్తున్నాడు’ అని శవపేటిక మీద తమిళంలో రాయించారు.
భారీగా తరలివచ్చిన డీఎంకే శ్రేణులు, అభిమానుల అశ్రునయనాల మధ్య కరుణానిధి అంతిమయాత్ర కొనసాగుతోంది.
తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలతో రాజాజీహాలు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.
అంతిమయాత్రలో పాల్గొనేందుకు రాజాజీ హాలు నుంచి వాలాజారోడ్, చెపాక్స్టేడియం మీదుగా మెరీనా బీచ్ వరకు ప్రజలు రోడ్లపైకి చేరుకున్నారు.
కరుణానిధి పార్థీవదేహం సందర్శకులకు కనిపించే విధంగా ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసి అంతిమయాత్ర కొనసాగిస్తున్నారు.
ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు భారీగా మోహరించారు.