Simhadri Appanna Giripradakshina Mahotsavam Devotees Rush at Simhachalam Temple,Visakhapatnam,Vizag vision..ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవం సంహాచలం సింహాద్రి అప్పన్న గిరి పౌర్ణమి మహోత్సవం 27 న జరగనుంది.32 కిలోమీటర్ల మేర భక్తులు లక్షలాదిగా మంది కాలినడకన గిరి ప్రదక్షిణం చేసి స్వామిని దర్శించుకుంటారు.ఈ రోజు మధ్యహ్నం స్వామివారి రథం గిరి ప్రదక్షిణకు బయలుదేరితుంది.రధంతో పాటు భక్తులు కూడా బయలుదేరుతారు.హరినామస్మరణలతో,తప్పిటగుళ్లు,పులివేశాలు,కోలాటాలతో బయలు దేరుతారు.అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు రథానికి కొబ్బరికాయ కొట్టి,జెండా ఊపి ప్రారంభిస్తారు.దారి పోడువున వందలాది మంది భక్తులు ప్రసాదాలను,మజ్జిగ,మంచినీరు అందిస్తారు.దారి పొడవునా సీసీ కెమెరాలతో పోలిసులు పహారా కాస్తారు.