విశాఖజిల్లా పాయకరావుపేట సమీపం లో పశువులను అక్రమంగా తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని పాయకరావుపేట పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకెళితే శ్రీకాకుళంజిల్లా, నరసన్నపేటనుంచి గోవులను ఐచర్ వాహనంలో తెలంగా ణ రాష్ట్రం హైదరాబాద్ కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచా రం మేరకు పాయకరావుపేట మండలం పెదరాంబద్రపురం సమీపంలో పోలీసులు వాహనాన్ని నిలిపి తణిఖీ నిర్వహించగా 24 పశువులను (22మగవి,2ఆడవి ) అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించా రు. ఈ సందర్భంగా పాయకరావుపేట ఎస్ ఐ రామకృష్ణ మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా గోవులను అక్రమంగా అంతరాష్ట్ర కబేళాకు తరలిస్తున్నారన్నారు. వాహనాన్ని సీజ్ చేసి,పశువులను విశాఖపట్నం జంతు పరిరక్షణ సమితి నిర్వాహకుల ద్వారా విశాఖజిల్లా బుచ్చియ్యపేట మండలం వడ్డాది గోశాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్ ఐ తెలిపారు