Iftaar meals for fasting Muclims,Kondapalli Shabuqari mosque,Krishna,Vizagvision..మైనారిటి వర్గాల అభివృద్ధికి , ముఖ్యంగా ముస్లింల అభ్యున్నతికి దివంగత ముఖ్య మంత్రిరాజశేఖర్ రెడ్డిగారి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని వైఎస్సార్ కాంగ్రెస్ మైలవరం నియోజక వర్గ ఇంచార్జి వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు . అదివారం సాయంత్రం కొండపల్లి షాబుఖారి మశీదు ప్రాంగణంతో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో అయన ముఖ్య అతిథిగా
హాజరయ్యారు . కృష్ణ ప్రసాద్ ను తొలుత సయ్యద్ షాబుఖారీ మశీదు తరపున , కొండపల్లి ఆస్థాన గురుప్రముఖులు హజరత్ అల్తాఫ్ అలీ రజా బాబా గౌరవంతో ఆహ్వానం పలికారు . ఇస్లాం సంప్రదాయం ప్రకారం వేషధారణను మార్చి కృష్ణ ప్రసాద్ కోసం ప్రత్యేక దువా ను చేశారు . అనంతరం మశీదు ప్రాంగణంతో ఏర్పటు చేసిన ఇఫ్తార్ భోజన విందును అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లడుతూ ముస్లింలకు అన్ని మాసాలలోకెల్లా రంజాను మాసం ప్రీతి పాత్త్రమైనదన్నారు. ఈ మాసంలో ఉండే ఉపవాసాలవల్ల పేదవాడి ఆకలిదప్పులు తెలుస్తాయన్నారు. ముస్లింల కోసం చివరిశ్వాసవరకు కృషి చేసిన వైఎస్సార్ తనయుడు జగన్ మెహన్ రెడ్డి నాయకత్వంలో తాను మైలవరం నియోజక వర్గ వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజల ముందుకి వచ్చానని , ముస్లిం మైనారిటీలు ఆశీర్వాదం కావాలని కోరారు . అనంతరం సయ్యద్ షాహ్ బుఖారీ మహాత్ములవారి దర్గాహ్ ప్రాంగణానికి వెళ్ళి ప్రత్యెక ప్రార్థనలు చెసారు . సయ్యద్ షహాబుఖారి మహాత్ములవారికి గులాబీలు ,చాదర్ సమర్పించారు .