శ్రీశైలంలో ఘంటా మఠం పునర్నిర్మాణ పనులు రాగిరేకులు లభ్యం Reconstruction Works Available Brass Plates Vizagvision…
ఘంటా మఠం పునర్నిర్మాణ పనులలో రాగిరేకులు లభ్యం
ప్రాచీన కట్టడాల పరిరక్షణ లో భాగంగా దేవస్థానము పంచమఠాల జీర్ణోద్ధరణ పనులను చేపట్టింది. ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ జీర్ణోద్ధరణ పనులు చేపట్టబడ్డాయి, కాగా ఈ రోజు (07.09.2020) సాయంకాలం ఘంటామఠ పునర్నిర్మాణ పనులు జరిపిస్తుండగా 28 రాగిరేకులు (తామ్ర శాసనాలు) లభించాయి. ఆయా రాగిరేకులపై నాగరి, తెలుగు, ఒరియా లిపి చెక్కబడి ఉంది
ఘంటామర ప్రాంగణములో ప్రధానాలయానికి ఎదురుగా గల ఆలయపు పునర్నిర్మాణ పనులలో ఆ రాగిరేకులు లభించడం జరిగింది. ఆలయానికి ఉత్తర వైపు గల గోడలు రాళ్ళ మధ్య ఈ రాగిరేకులు కనుగొనబడ్డాయి
విషయము తెలిసిన వెంటనే కార్యనిర్వహణాధికారివారు సంబంధిత అధికారులతో కలిసి ఘంటా మఠం చేరుకుని రాగిరేకులను పరిశీలించారు. కాగా రాగిరేకులు దొరికిన వెంటనే స్థానిక పోలీస్ మరియు రెవెన్యూశాఖలకు సమాచారాన్ని తెలియజేయడం జరిగింది
స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీ రవీంద్ర, మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ జి. రవి, స్థానిక విఆర్ఓ
నాగచంద్రుడు ఘంటామఠానికి చేరుకుని రాగి రేకులను పరిశీలించారు రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షములో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహారెడ్డి, సహాయ స్థపతి జవహర్, సహాయ ఇంజనీరు సురేష్
తదితరులు పంచనామా చేసి రాగిరేకుల వివరాలను నమోదు చేశారు
ఈ రాగిరేకులలో 5 % x 8 అంగుళాల సైజుగల 3 రాగిరేకులు, 6 4×9 % సైజులో
3 రాగిరేకులు, 4 % x 8 % సైజులో 3 రాగిరేకులు, 5 x 9 % సైజులో 3 రాగిరేకులు, 5% x 9 సైజులో 3 రాగిరేకులు, 6x 9 % సైజులో 3 రాగిరేకులు, 5x 9 సైజులో 4 రాగిరేకులు, 4 % x 9 % సైజులో 4 రాగిరేకులు 3 x 8 సైజులో 2 రాగిరేకులు మొత్తం 28 రాగిరేకులు లభించాయి అదేవిధంగా స్థానిక తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రొఫెసరు ఆర్. చంద్రశేఖరరెడ్డి