Sri Adi Shakti Naga Devi Amma Shakambari with “Annabishekam” Visakhapatnam,Vizag Vision…విశాఖమహనగరం పుార్ణమార్కెట్ సమీపంలోగల పుడ్ కోర్ట్ ప్రాంతంలో గల శ్రీ నాగదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శాకాంబరి అమ్మవారిగా అలంకరణ చేశారు.ప్రాత కాలమే షోడశోపచార పూజలు అనంతరం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆపై సహస్రనామాలతో కుంకుమార్చలను నిర్వహించారు అనంతరం అన్నము తో అమ్మవారిని దివ్య అలంకరణ అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారు .శాకంబరి అమ్మవారి అలంకరణ ఉన్న అమ్మవారికి మంగళ నీరాజనాలు సమర్పించారు .భక్తులు శాఖంబరి అమ్మవారిని బౌతిక దూరం పాటించి అమ్మవారిని దర్శించికున్నారు.అలాగే కోవిడ్ మహమ్మారి నివారణలో బాగంగా ప్రభుత్వ ఆదేశాలను అనుసారం తీర్ధప్రసాదాలను నిషేదించామని ఆలయ నిర్వహకులు తెలిపారు.

















