అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కలిశారు..సింగపూర్ పర్యటనలో ఉన్న మోదీ.. అక్కడ అమెరికా రక్షణ మంత్రితో భేటీ అయ్యారు.
ఇటీవల ఇండియాకు ప్రత్యేక గుర్తింపు ఇస్తూ.. అమెరికా తన పసిఫిక్ కమాండ్ పేరును ఇండో పసిఫిక్ కమాండ్గా మార్చింది.
దీంతో రెండు దేశాల మధ్య రక్షణ బంధాలు మరింత బలపడ్డాయి.
రహస్యాంగా సాగిన సమావేశంలో.. ఇద్దరూ భద్రతాపరమైన అంశాల గురించి చర్చించినట్లు సమాచారం.
ప్రతి ఏడాది జరిగే షాంగ్రీ లా మీటింగ్కు మోదీతో పాటు మాటిస్ కూడా హాజరయ్యారు.