తలకిందులుగా జాతీయ పతాకావిష్కరణ,…మహాముత్తారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా): తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జెండా ఆవిష్కరణలో అపశృతి జరిగింది. జాతీయ గీతాలాపన సమయంలో జెండా ను తలకిందులుగా ఎగురవేసిన విషయాన్ని తహసీల్దార్ గమనించారు. గీతాలాపన అనంతరం జెండాను అవనతం చేసి సరి చేసి మళ్లీ ఎగుర వేశారు. అయితే గద్దె వద్ద ఏర్పాటు చేసిన జెండాను వీఆర్ఏ సరిగా చూసుకోకపోవడం, వర్షం కారణంగా హడావుడిగా ఎగురవేయడంతో తప్పిదం జరిగిందని ఇన్చార్జి తహసీల్దార్ ముక్తార్పాషా తెలిపారు.