రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన తరుపున పోటీ చేసే మొదట అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం స్థానాన్ని పితాని బాలకృష్ణను కేటాయించినట్లు జనసేనాని వెల్లడించారు. అజ్ఞాతవాసి తర్వాత ఇక ఇప్పట్లో సినిమాల్లో నటించనని, రాజకీయ రంగంపైనే దృష్టిపెడుతానని పవన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చెప్పిన మాట ప్రకారం జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజల సాధకబాధకాలు తెలుసుకొంటున్నారు.