అమెరికాలోని *కొలంబస్* లో BJP ఆధ్వర్యంలో జరిగిన సమావేశం లో అంధ్రప్రదేశ్ బి జె పి అధ్యక్షులు *కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్* అన్నయ్య ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు
ఈ సందర్బంగా కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ కొలంబస్ లో OFBJP మీటింగ్ లో పలు విషయాలు పై స్పష్టత ఇచ్చారు,
ప్రధానంగా బీజేపీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్ట్స్, పథకాలు, ప్రత్యేక హోదా పై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న అబద్ధాల ప్రచారంపై యు టర్న్ , అవినీతిపై అమెరికా OFBJP కి దిశ నిర్దేశం, చేస్తూ కొన్ని సూచనలు చేశారు,
ప్రధానంగా హోదా పై చంద్రబాబునాయుడు ఒప్పుకున్న విషయం
హోదా వద్దు ప్యాకేజి చాలా బెనిఫిట్ అని 16-09-2016వ తేదీన రాత్రి 11 గంటల వరకు వెంకయ్యనాయుడు గారి సమక్షంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో అధికారికంగా ఒప్పుకున్న ఈ చంద్రబాబునాయుడు,
జరిగిన 4సంవత్సరాల నుండి హోదా వద్దు ప్యాకేజి ముద్దు అని కేంద్రం దగ్గర ఒప్పుకొని
, ఆ రోజు వెంకయ్యనాయుడు గారిని ఆంద్రప్రదేశ్ వచ్చినప్పుడల్లా సన్మానాలు, సత్కారాలు, , చేసి , హోదా గురించి మాట్లాడిన వారిని అరెస్టులు కూడా చేయించిన ఘనత ఈ అబద్ధాల చంద్రబాబు ది,
ప్రతి పక్షంలో ఉన్న వై.సి.పి నేత జగన్మోహనరెడ్డి హోదా -అని ధర్నా చేస్తుంటే ఎగతాళి చేసిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి , సినిమా వాళ్ళను పోలీసుల చేత లాఠీచార్జి చేసిన ఘనుడు,
ఈశాన్య రాష్ట్రాలకు హోదా ఇచ్చినప్పటికి పెద్దగా ఒరిగింది ఏమి లేదు అని చెప్పారు, అన్ని ప్రముఖ పత్రికల్లో టి.వి.ల్లో వచ్చింది,
హోదా అంటే కేవలం తాళి కట్టి వదిలివేయడం లాంటిది అని,
కేవలం 30శాతం మాత్రమే అదనంగా బెనిఫిట్ అని
అంతకుమించి కేంద్రం సహాయం చేసిందని చెప్పారు,