కాపల్లి జీవీఎంసీ పాఠశాల లోకి అడుగుపెట్టాలంటే ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు తయారుచేసిన ఈ పాఠశాల కు ఘన చరిత్ర ఉంది. ప్రస్తుతం అనకాపల్లిలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఇక్కడ దుర్గంధ పరిస్థితి నెలకొంది ఐదేళ్ల క్రితం అనకాపల్లి పరిధిలో ఉన్న చెత్తను శారదానగర్ సమీపంలో ఉన్న డంపింగ్యార్డుకు తరలించేవారు. అక్కడ ప్రజలు దీనిని అడ్డుకోవడంతో ప్రస్తుతం ఉన్న చెత్తను అనకాపల్లి జీవీఎంసీ కార్యాలయంలో ఉన్న ఆవరణలో ప్రతిరోజు చేసి అక్కడినుండి విశాఖకు తరలిస్తున్నారు. కార్యాలయం అనుకుని ఉన్న జివిఎంసి పాఠశాలకు ఈ చెత్త వలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. చెత్త నుంచి వచ్చే దుర్వాసన వారి చదువుకు శాపంగా మారింది. ఒకపక్క పాటలు వినలేక మరోపక్క మధ్యాహ్నం భోజనం చేయలేక ప్రతిరోజు నరకం చూస్తున్నారు. పట్టణంలో జీవీఎంసీ పట్టణ ఉన్నత పాఠశాల జోనల్ కార్యాలయాలు ఒకదానికొకటి ఆనుకుని ఉంటాయి. జివిఎంసి పారిశుధ్య సిబ్బంది సేకరించిన చెత్తను అంతటిని వాహనాల ద్వారా తెచ్చి పాఠశాల ప్రహరీని ఆనుకుని ఉన్న జోనల్ కార్యాలయంలో వేస్తున్నారు. చెత్త పెద్ద కుప్పలుగా ఏర్పడినప్పుడు భారీ వాహనాల ద్వారా విశాఖపట్నం కంపోస్టు యార్డు కు తరలిస్తున్నారు. పారిశుధ్య కార్మికులు సేకరించిన చెత్త తోపాటు జంతువుల మృత కళేబరాలు, ఆసుపత్రి వ్యర్ధాలు వేయడం వలన ఈగలు దోమలు చేరుతున్నాయి దీని నుంచి వచ్చే దుర్వాసన నేరుగా పాఠశాల తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయుల పాఠ్యాంశాలు బోధించే లేక విద్యార్థులు వినలేక అవస్థలు పడుతున్నారు.