ఉభయగోదావరి జిల్లాల్లోని వరదప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు బుధవారం విహంగవీక్షణంద్వారా పరిశీలించారు.
అనంతరంరాజమహేంద్రవరం విమానాశ్రయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ..తూర్పుగోదావరి జిల్లాలోని45 గ్రామాలకు వరద తాకిడి ఎక్కువగాఉందని, బాధితుల కోసం 16 పునరావాసకేంద్రాలు నడుస్తున్నాయనితెలిపారు.
6,600 హెక్టార్లలోపంట నష్టం జరిగింది. పశ్చిమగోదావరిజిల్లాలోని ఎర్రకాలువ వల్లఎక్కువ నష్టం జరిగింది.
కాజ్వేలపునర్నిర్మాణం కోసం నిధులుకేటాయిస్తున్నాం.
నష్టపోయినరైతులను ఆదుకుంటాం.
రెండు జిల్లాల్లోకలిపి రూ.600 కోట్ల నష్టం జరిగింది.
ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైనపరిహారం చెల్లిస్తాం.
హెక్టారుకురూ.25వేలు చొప్పున నష్టపరిహారంఅందిస్తాం.
ఎర్రకాలువ ముంపుసమస్య శాశ్వత పరిష్కారానికిప్రయత్నిస్తాం.
ఆర్.అండ్.బిరహదారులకు రూ.35 కోట్లు కేటాయిస్తాం.
రాయలసీమలో కరవు ఉంది… కోస్తాలోవరదలు వచ్చాయి.
రాష్ట్రంలో ఆరుజిల్లాల్లో కరవు ఉంది.
గోదావరినుంచి 1500 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి.
పోలవరం పనులు 57.5శాతం పూర్తయ్యాయి.
వచ్చే ఏడాది మే నాటికి పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం
పోలవరం కోసం కేంద్రం నుంచి రూ.2,600కోట్లు రావాల్సి ఉంది.
కేంద్రంనిర్మాణ బాధ్యతలు తీసుకున్నా అభ్యంతరం లేదు.
రాష్ట్రంలో 57ప్రాధాన్య ప్రాజెక్టులు చేపట్టాం..16 పూర్తయ్యాయి’’ అని చంద్రబాబువెల్లడించారు.