మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో గ్రామదర్శిని నోడల్ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సు బుధవారం ఉదయం ప్రారంభమైంది.
ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత కరుణానిధికి సదస్సు సంతాపం ప్రకటించింది.
దాదాపు వెయ్యిమంది గ్రామదర్శిని నోడల్ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.