Ragging & Drug Free Campus Poster Realised by Minister Ganta in AU,Visakhapatnam,Vizag Vision..ాష్ట్రంలో అన్ని చోట్ల ర్యాగింగ్ పూర్తిగా తగ్గిపోయిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.ర్యాగింగ్ వ్యతిరేకంగా ఏయూ సెనేట్ హాల్లో పోస్టర్ ను మంత్రి గంటా ఆవిష్కరించారు.ర్యాగింగ్ రహిత విశ్వవిద్యాలయం తీర్చి దిద్దాలనే విద్యార్ధులు ఆలోచన చాలా గొప్పదని మంత్రి విద్యార్ధులను అభినందించారు.రాష్ట్రంలో ఎక్కడ ర్యాగింగ్ జరగకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని,రితిషేశ్వరి ఘటన తర్వాత రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలుతో పాటు కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని మంత్రి గంటా అన్నారు.విద్యాలయాలు దేవాలయాలని అన్నారు.యువత డగ్స్ ,మద్యానికి దూరంగా ఉండాలని పిలుపు నిచ్చారు.ఈ నెల 20 తేదిన ఏయూలో జరిగే జ్ఞానభేరి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారని మంత్రి గంటా అన్నారు.