అమర్నాథ్ యాత్రను రెండు రోజులపాటు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.
కశ్మీరు లోయలో వేర్పాటువాదులు రెండు రోజుల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నగరంలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి ఇతర చోట్లకు వెళ్ళేందుకు భక్తులను అనుమతించబోమని పోలీసులు తెలిపారు.
జమ్మూ-శ్రీనగర్ హైవేపై భక్తులు ప్రయాణించకుండా నిరోధించేందుకు ఉధంపూర్, రామ్బన్ల వద్ద ప్రత్యేక చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బల్తాల్, పహల్గామ్ శిబిరాల్లో ఉన్న భక్తులు తమ యాత్రను కొనసాగించవచ్చునని పేర్కొన్నారు
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దాదాపు 200 మంది తీవ్రమైన చలి వాతావరణం వల్ల సిమికోట్, హిల్సాలలో నిలిచిపోయారు.
నేపాల్లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం ఈ సమాచారాన్ని తెలిపింది.
సిమికోట్లో 124 మంది, హిల్సా సమీపంలో 50 మంది మానస సరోవర భక్తులు ఉన్నట్లు శనివారం గుర్తించినట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.