అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ కేంద్రాలు ప్రారంభం…
రెండో విడతలో అగస్టు 15 కల్ల మరో 103 క్యాంటీన్ లు ఏర్పాటు. మొత్తం203 కేంద్రాలలో ప్రతిరోజూ రెండున్నర లక్షల మందికి అల్పాహారం, భోజనం అందించేలా ఏర్పాట్లు. క్యాంటీన్ లో లబ్ధదారులతో కలసి భోజనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోజనం ఎలా ఉందని అడిగితెలుసుకున్న ముఖ్యమంత్రి…
క్యాంటీన్ పరిసరాలను స్వయంగా పరిశీలించి తగు సూచనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అనంతరం విజయవాడ ఎ1 కన్వెన్షన్ లో జరిగిన సమావేశం లో లబ్ధిదారులు ను ఉద్దేశించి ప్రసంగించారు..ప్రతి పేదవాడు కడుపు నిండా తినాలనే సదుద్దేశంతో అన్న క్యాంటీన్ లను ప్రారంబించాం..క్వాలిటీ, విషయంలో రాజీ పడకుండా పేదలను ఆహారాన్ని అందిస్తాం . పూర్తి పారదర్శకంగా క్యాంటీన్లు నిర్వహించేందుకు ప్రజల అభిప్రాయ సేకరణ కూడా చేపట్టాం…రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ల ద్వారా రెండున్నర లక్ల మందికి అల్పాహారం, భోజనం అందిస్తాం…పేదలు, వృద్దులకు ఈ క్యాంటీన్ లు ఒక వరం…భవిష్యత్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ క్యాంటీన్ ల నిర్వహణ కొనసాగుతుంది…అవసరమైతే దాతలు పుట్టినరోజు లకు ఇతర కార్యక్రమాలు కు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తాం.