HRD Minister released Intermediate I & II years advanced supplementary results,Vizagvision..
ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలను పరీక్ష జరిగే 18 రోజుల లోపలే విడుదల చేయడం పట్ల మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ అధికారులకు అభినందించారు
విశాఖపట్నం వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో మంగళవారం ఉదయం ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రోజుల్లో ఫలితాలు విడుదల చేయడం ఆల్ టైం రికార్డ్ గా అభివర్ణించారు ఈ పరీక్షలో నాలుగు లక్షల 35వేల 764 మంది హాజరైనట్లు తెలిపారు బయోమెట్రిక్ ద్వారా పరీక్షలు నిర్వహించామన్నారు జనరల్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం రెండు లక్షల 97 వేల 862 మంది హాజరు కాగా ద్వితీయ సంవత్సరం ఒక లక్ష 19వేల 575 మంది హాజరుకాగా మొత్తం నాలుగు లక్షల 17వేల 437 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు ఒకేషనల్ కు సంబంధించి ప్రథమ సంవత్సరం 11,710 విద్యార్థులు హాజరు కాగా ద్వితీయ సంవత్సరం 6617 మంది విద్యార్థులు తో కలిపి మొత్తంగా 18వేల 327 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు మంత్రి గంటా తెలిపారు ఒకేషనల్ జనరల్ కలిపి మొత్తంగా నాలుగు లక్షల 35 వేల 764 మంది పరీక్షకు హాజరయ్యారు
మార్చి 2018లో ఫెయిలైన విద్యార్థులు ఒక లక్ష 53319 మంది పరీక్షలు రాయగా వారిలో 48 వేల 998 మంది పాసయినట్లు మంత్రి ధ్రువీకరించారు
అలాగే బెటర్మెంట్ కొరకు పరీక్ష వ్రాసిన అందరూ పాసయినట్లు మంత్రి తెలిపారు
ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 65 శాతం పాస్ కాగా ద్వితీయ సంవత్సరం 46 శాతంగా ఉందన్నారు
ఒకేషనల్ లో ప్రథమ సంవత్సరం55% శాతంతో పాసయ్యారు సెకండియర్ జనరల్ విద్యార్థులు 46% తోపాస్ అయ్యారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమీషనర్ ఉదయలక్ష్మి తో పాటు విద్యాశాఖ అధికారులు యూనివర్సిటీ వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ ఉమామహేశ్వరరావు పలు అధ్యాపకులు పాల్గొన్నారు