భారత ప్రధాన ఎన్నికల అధికారి(సిఈసి)గా ఓం ప్రకాష్ రావత్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సిఈసిగా ఆచల్ కుమార్ జ్యోతి పదవీకాలం
నేటీతో ముగిసింది. ఆయన స్థానంలో ఓం ప్రకాష్ రావత్ బాధ్యతలు చేపట్టారు. మధ్యప్రదేశ్ మాజీ ఐఏఎస్ కేడర్కు చెందిన రావత్ రాష్ట్ర, దేశ స్థాయిలో
పలు హోదాల్లో సేవలు అందించారు. రక్షణ, భారీ పరిశ్రమల శాఖతో పాటు ఆయన 2004-06 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రిన్సిపాల్కి సెక్రటరీగా
వ్యవహరించారు. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమీషన్ నుంచి సిఈసిగా రావత్ పదోన్నతి పొందటంతో ఆయన స్థానంలో కమీషనర్గా ఆర్థికమంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అశోక్ లవాసా నియమితులయ్యారు. 2015 ఆగస్టులెఓ ఆయన ఎన్నికల కమీషనర్గ నియమితులయ్యారు