దావోస్ లో జరుగుతున్న అర్దిక సదస్సు లో మన తెలుగు రాష్ట్రాల నాయకులు సందడి..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని మర్యాద పూర్వకంగా కలుసుకున్న తెలంగాణ ఐ టి శాఖ మంత్రి కె టి అర్..
తెలుగు రాష్ట్రాల ఐ టి శాఖ మంత్రులు నారా లోకేష్, కె .టి .అర్ కలసుకుని పలు విషయాలను చర్చించారు
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఎకనామిక్ ఫోరంలో తెలుగు నేతలు సందడి చేశారు. కనిపించిందే తడవుగా నవ్వుతూ ఒకరినొకరు సరదాగా పలకరించుకున్నారు. అనంతరం కెమెరాలకు పోజులిచ్చారు. ముఖ్యంగా ప్రాంతాలు విడిపోయిన తర్వాత తమ తమ రాష్ట్రాల్లో ఒకరినొకరు పలకరించుకునేందుకు కూడా తీరికలేనంతగా గడిపేస్తున్న వారు ఓ సుదూర ప్రాంతంలోని వేదిక ద్వారా తారసపడటంతో వారి మధ్య నవ్వులు విరిశాయి.
యోగక్షేమాల సమాచారం బదిలీ అయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి తారక రామారావు (కేటీఆర్) డబ్ల్యూఈఎఫ్లో ప్రధాన ఆకర్షణగా కనిపించారు. వారు ఒకరినొకరు పలకరించుకొని కబుర్లు పెట్టుకుంటూ ఫొటోలకు పోజులిచ్చారు.