ప్రపంచంలో వున్న ఏకైక విశ్వవిద్యాలయం ద్రవిడియన్ యూనివర్శిటీలో నిన్న ముగిసిన జాతీయ సదస్సలో “సాహిత్యంలో వస్తున్న నూతన పోకడల పై” ప్రముఖ వైద్యులు, సాహితీవేత్త ఆచార్య డా|| కూటికుప్పల సూర్యారావు కీలకోపన్యాసం చేశారు. ద్రావిడియన్ విశ్వవిద్యాలయం ఆహ్వానంపై సదస్సులో పాల్గొనడం, ప్రముఖంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తులు భాషల పై అధ్యయనాలు, పరిశోధనలు సాగుతున్న తీరు నన్ను ఎంతగానో ఆకర్షించిందని, భాషలు సమాజం, సంసారాన్ని, కట్టుబాట్లని, పరిపాలనా విధనాలని ఎలా ప్రభావితం చేస్తుందో సోదాహరణంగా డా|| సూర్యారావు వివరించారు
![](https://www.vizagvision.com/wp-content/uploads/2021/04/e9dba114-7d4e-4611-931b-76cb86ed-1.jpg)
డా॥ ఎస్ చెల్లప్ప సాహిత్య కృషిపై సదస్సులో వివిధ చర్చలు జరిగాయి. డా॥ చల్లప్ప గారు తమిళంలోకి అనువాదం చేసిన డా|| కూటికుప్పల సూర్యారావు రచించిన సూర్యకిరణాలు గ్రంథాన్ని ద్రవిడియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. తుమ్మల రామకృష్ణ గారు బనారస్ హిందూ యూనివర్సిటీ, తెలుగు శాఖాధిపతి ఆచార్య భూదాటి వేంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఆచార్య తుమ్మల రామకృష్ణ, ఆచార్య భూదాటి, డా॥ చల్లప్పు గారి కృషిని, గ్రంథకర్త డా||
సూర్యారావు గారిని అభినందించారు. దేశంలో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి హాజరైన ఆచార్యులు,
![](https://www.vizagvision.com/wp-content/uploads/2021/04/188d55eb-bbfd-4888-a43e-9bcbf8d4-1.jpg)
పరిశోధకులు కరోనా ప్రోటోకాల్ పాటించి సదస్సును విజయవంతం చేశారు