VEDA Cricket Tournament Artists Are Progressives in Visakhapatnam Vizag Vision….
ఈవెంట్ ఇండస్ట్రీ మీడియా కి సంభందించిన వేద క్రికెట్ టోర్నీ శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యింది.. మేజిక్ రవిశంకర్ కన్వీనర్ గా వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో వైజాగ్ ఈవెంట్ మేనేజర్స్అసోసియేషన్,ఈవెంట్ మేనేజర్స్అసోసియేషన్,డెకరేషన్ ఆర్టిస్ట్స్,ఆర్టిస్ట్ క్రికెట్ లవర్స్ ల మధ్య క్రికెట్ పోరు రసవత్తరంగా సాగింది.ఆయా టీం లలో మీడియా కు సంభందించిన రేడియో జాకీలు,యాంకర్లు,జర్నలిస్ట్ లు కూడా వున్నారు.కరోన ప్రభావంతో గత 9 నెలలుగా ఈవెంట్ ఇండస్ట్రీ కుదేలైన నేపధ్యంలో వారికి ఆటవిడుపుగా, వారిలో ఉత్సాహాన్ని నింపడానికి ఈ టోర్నీలో నిర్వహిస్తున్నామని టోర్నీ చైర్మన్ సూరంపూడి వీరభద్రరావు తెలిపారు. మొదటి మ్యాచ్ వేమా x డిసిఆర్ స్ కు,రెండవ మ్యాచ్ ఏసిఎల్.. ఈమాకు,మూడవ మ్యాచ్
డీసీర్స్ x ఈమాకు,నాల్గవ మ్యాచ్ వేమా x ఏసీఎల్ l కు జరుగుతుందని తెలిపారు.
ఈ టోర్నీ కి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఎల్వీoదర్ యాదవ్ ఐ.ఆర్.టి.యెస్,హరనాథ్ మోపురి ఐ.ఆర్.టి.యెస్,డా.వి.సన్యాసిరావు అదనపు కమిషనర్ జి.వి.యం.సి జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి.., వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తొలుత బాటింగ్ చేసి టోర్నీ ని ప్రారంభించారు. అతిథిలుగా ఆంధ్రావాయిస్ ఎండీ బి.గిరిబాబు,నగర ప్రఖ్యాత వైద్యుడు డా.రామమూర్తి, APBBA చైర్మన్ నాగేశ్వరరావు కె.ఎమ్.వి.యెస్,పద్మావతి ఫంక్షన్ హాల్స్ ఎండీ భాస్కర్,కామధేను రవి కుమార్,సోషల్ వర్కర్ గూడెల జయరామ్, లు పాల్గొంటున్నారు. అలాగే ఈ టోర్నీకి స్పాన్సర్స్ గా ఎండీ గిరిబాబు, పద్మావతి ఫంక్షన్ హాల్,కామధేను జున్ను పౌడర్, సిల్వర్ ప్యాలస్, అమృతం రెస్టారెంట్,విశాఖ ఈవెంట్స్,వీరూ ప్రాపర్టీస్ వీరూమామ లు వ్యవహరించారు.