ప్రభుత్వ ఇసుక డిపో లో 14 వేల టన్నుల ఇసుక మాయమైందని EX TDP Minister Ayyanna Patradu in Visakhapatnam,Vizagvision…
విశాఖ జిల్లాలో ప్రభుత్వ ఇసుక డిపో లో 14 వేల టన్నుల ఇసుక మాయమైందని.దీని వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని దీనిపై సమగ్ర విచారణ జరిపి దోపిడీదారులను వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.ప్రభుత్వ ఇసుక డిపో లో ఇసుక మాయమైన విధానం చూస్తుంటే నాయకులకు అధికారులు ఏ విధంగా కొమ్ముకాసిన విషయం అర్థమవుతుంది.
ఒక్క విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ ఇసుక డిపోల్లో 14 వేల టన్నుల ఇసుక మాయమైంది అంటే రాష్ట్రంలో 13 జిల్లాల వ్యాప్తంగా ఎన్ని లక్షల టన్నుల ఇసుక మాయం అవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి.
సుమారు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత కారణంగా రోడ్డున పడ్డారు. పరోక్షంగా మరో 40 లక్షల మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు.
జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్ లకు పాల్పడుతున్నారని.
రాత్రికి రాత్రే గ్రావెల్ కొండలను మాయం చేస్తున్నా పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు.
ఉత్తరాంధ్రలో రెడ్డి ల పాలన నడుస్తుంది. ఆర్ధిక నేరగాడు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర పై ముఖ్యమంత్రు లాగా పెత్తనం చెలాయిస్తున్నారు.
మంత్రి పదవి పోతుందనే భయం తో అవంతి ఏమి మాట్లాడ లేక పోతున్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును తగ్గించే యోచనలో ఉన్నారు.
అదే గనుక జరిగితే పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు చుక్క నీరు కూడా వచ్చే అవకాశం ఉండదు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తో పోలిస్తే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం చాలా అరాచకంగా ఉంది.
ఉత్తరాంధ్రలో ఎంతో మంది ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర నాయకులు అంతా ఏకమై పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం లో ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయం పై పోరాటం చేయకపోతే భవిష్యత్తులో పోలవరం ఫలాలు ఉత్తరాంధ్ర కోల్పోక తప్పదు.
ఉత్తరాంధ్ర నాయకులు ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేయకపోతే ఈ ప్రాంత నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారు