Vizag Vision Covid Warriors Felicitation & Women’s World Log Inauguration in Visakhapatnam
కరోనా విపత్కర పరిస్థితుల్లో Vizagvision కోవిడ్ వారియర్స్ సేవలు ప్రశంసనీయం..
వారియర్స్ అందించిన సేవలు ప్రశంసనీయమని సెంచూరియన్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎస్ఎన్ రాజు కొనియాడారు. ఆదివారం పౌర గ్రంథాలయంలో సోషల్ మీడియా “ వైజాగ్ విజన్” పలువురు వారియర్స్ ని ఘనంగా సత్కరించింది. అదే సందర్భంలో మహిళలకు మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలన్న సంకల్పంతో నూతనంగా ఏర్పాటు చేసిన “ ఉమెన్ వరల్డ్” యూట్యూబ్ ఛానల్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ అందరి సహకారంతోనే కరోనా నియంత్రించడం సాధ్యం అవుతుందన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. కోవిడ్ వారియర్స్ ను సత్కరించడం హర్షణీయమని వైజాగ్ విజన్ సామాజిక సంస్థ త్రినాధ్ ను అభినందించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన VJF అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కోవిడ్ లో
జర్నలిస్టులు అందించిన సేవలు మరువలేనివన్నారు. వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి విధులు నిర్వహించారని కొనియాడారు. గౌరవ అతిధులుగా హాజరైన జీవీఎంసీ యుసిడి ప్రాజెక్ట్ డైరెక్టర్ యాదగిరి శ్రీనివాస్, విజేఫ్ కార్యదర్శి ఎస్ దుర్గారావు,డాక్టర్ కె. రామ్ కుమార్ లు త్రినాథ్, ఉమెన్స్ వరల్డ్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మి లను ప్రశంసించారు.
ఈ సందర్బంగా COVID వారియర్స్ సత్కరించిరు
Abudulla Best journalist,Subramanayam Best photography,Vanapalli Ravi Kumar Best Social Worker,K Padmavati Best Nursing,Gopinadh Best Sanatry,Dr K.Ram Kumar Best Service,Gantala Srinu babu Best Service వారి తో పాటు పలువురిని సత్కరించి Certificate,మెమెంటో లు అందచేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాత గా జర్నలిస్ట్ వరలక్ష్మి ,Madhan,వ్యవహరించారు.