Professional Photographers & Videographers Union Bandh in Visakhapatnam,Vizagvision….ఫోటో స్టూడియో యూనియన్ తరుపున ఫోటోగ్రఫర్లు ఆంద్రప్రదేశ్ ఫోటోగ్రఫర్ యూనియోన్ రాష్ట్ర బందు పిలుపుమేరకు ఈ రోజు ఫోటో స్టూడియో యజమానులందరు ఒక్క రోజు బందు నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఈ కరోనా మహమ్మారి వైరస్ సందర్బంగా లాక్ డౌన్ విధించడం వలన మా బ్రతుకులు ఆర్థికంగా వెనుకపడ్డాయి అని గత ఆరు నెలల నుంచి ఒక్క శుభకార్యములు జరగకపోవడంతో డబ్బులు లేక ఇంటి అద్దె,నిత్యావసర సరుకులు,సరిఅయిన తిండి లేక ఇబ్బంది పడుతూ అప్పులుపాలైపోయిన మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మమ్ములను గుర్తించి మా జీవన మనుగడకు ఆర్ధికంగా నిలదొక్కుకోనుటకు సరిఅయిన మార్గం చూపాలని కోరారు.