కరోనా వైరస్ .. వుహాన్ కు ఎయిర్ ఇండియా భారత్ విమానం
చైనాలోని వుహాన్ నగరంలో ఉన్న సుమారు 400 మంది భారతీయ విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరి వెళ్లనున్నది. ఆ విమానంలో కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన అయిదు మంది డాక్టర్లు ఉన్నారు.
ఢిల్లీ నుంచి వుహాన్ సిటీకి ఎయిర్ ఇండియాకు చెందిన బీ747 విమానం వెళ్తున్నది. చైనాలో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే.
ఆ వైరస్ వల్ల ఇప్పటికే చైనాలో 213 మంది చనిపోయారు. మరో పది వేల మందికి ఆ వైరస్ సోకింది.
ఇక భారత విద్యార్థులు వచ్చే విమానంలో కొన్ని ఆంక్షలు పెట్టారు. ఇన్ఫెక్షన్ను అడ్డుకునేందుకు విమానంలో ఎటువంటి సర్వీస్ ఉండదని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు.
సీ ప్యాకెట్ల రూపంలో ఆహారం ఉంటుందని సీఎండీ అశ్వనీ లోహనీ తెలిపారు. క్యాబిన్ క్రూ, ప్రయాణికుల మధ్య ఎటువంటి ఇంటరాక్షన్ ఉండదు.
మాస్క్లను కూడా విమానంలో అందుబాటులో ఉంచారు. బయలుదేరిన రెండు లేదా మూడు గంటల్లో విమానం వుహాన్లో ల్యాండ్ అవుతుందన్నారు.
చైనా నుంచి వచ్చిన విద్యార్థులను 14 రోజుల పాటు అబ్జర్వేషన్లో పెట్టనున్నారు. వారి నుంచి వైరస్ సోకకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటారు.
ఢిల్లీ, మనేసర్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లలో ఆ విద్యార్థులను రెండు వారాల పాటు ఉంచుతారు.
రేపు తెల్లవారుజామున 2 గంటల కల్లా ఆ విమానం మళ్లీ భారత్కు రానున్నది. చైనా నుంచి తిరిగి వస్తున్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ అడ్వైజరీ జారీ చేసింది.