ఐదు నెలలుగా జగన్ పాలన అంతా రాక్షస పాలన
ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు
టిడిపి నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టి వేధిస్తున్నారు
సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల ఎందువల్ల చనిపోయారో అందరూ చూశారు
డిస్ట్రిక్షన్ తో ప్రజావేదికను కూలగొట్టి జగన్ పాలన ను ప్రారంభించారు
రౌడీయిజం, రాక్షసత్వం ఫ్యాక్షనిజం .. ఇదే ఎపి లో నడుస్తుంది
మన వాళ్లు ఎంతోమంది మేధావులు గా విదేశాలలో ఖ్యాతి గడించారు
వారిని తయారు చేసిన అధ్యపకుల ను అక్రమంగా అరెస్టు చేయిస్తారా
జగన్ ప్రభుత్వం లో జరుగుతున్న అరాచకాలను ఆధారాలతో గవర్నర్ కువివరించాం
వందలాది మంది వైసిపి మద్దతుదారులతో దాడులు చేయిస్తారా
నిజాయితీ తో ఉన్న అధికారులు ,అధ్యాపకుల పై తప్పుడు కేసులు పెడుతున్నారు
జగన్ ప్రభుత్వం నేడు సిగ్గు తో తల దించుకోవాలి
విసి పై కేసు ఉద్దేశ పూర్వకంగా పెట్టిందని అందరికీ అర్ధం అవుతుంది
దేశంలో ఎక్కడా లేని విధంగా ఘోరాలు, నేరాలను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది
అన్ని విధాలా ఎపి ప్రజలు నష్టపోతున్నారు.. రాష్ట్రం వెనక్కి వెళ్లిపోతుంది
పత్రికల ద్వారా నే తనకు కూడా సమాచారం ఉందని గవర్నర్ చెప్పారు
అన్ని విషయాల పై విచారణ చేపిస్తానని హామీ ఇచ్చారు
నేడు విద్యా వ్యవస్థ ను విచ్చిన్నం చేసేలా జగన్ వ్యవహరిస్తున్నారు
రాష్ట్రం అభివృద్ధి కోసమా, తన కేసుల కోసమా ఢిల్లీ పర్యటన అనేది జగన్ కే తెలియాలి
టిడిపి హయాంలో జరిగిన కట్టడాలను కూల్చడం మినహా జగన్ చేపట్టిన నిర్మాణాలు ఎక్కడ?