మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ కావలి ప్రతిభా భారతి అస్వస్థతకు గురయ్యారు. ఆమె తండ్రి జస్టిస్ పున్నయ్య(92) అనారోగ్యంతో విశాఖలోని పినాకిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రిని చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన ప్రతిభా భారతికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమై అక్కడే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిభాభారతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.