YCP’s Vijay Sai Reddy Padayatra in Vizag,Vizag Vision.చంద్రబాబు నాయుడు ఓ దొంగ అని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసంకల్ప యాత్రకు సంఫీుభావంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన రెండవ విడత పాదయాత్ర మంగళవారం రెండో రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ధనార్జనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. ఈ నాులుగేళ్లలో చంద్రబాబు మూడు లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విదేశాలకు చంద్రబాబు అక్రమంగా తరలించిన మూడు లక్షల కోట్ల రూపాయలను తిరిగి రప్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యులు చేపట్టి, ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల ని డిమాండ్ చేశారు. దొంగ ఎక్కడా దాక్కున్నా చట్ట ప్రకారం శిక్షించబడాలి అన్నారు. తప్పు చేయకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, చంద్రబాబు, తన తనయుడు లోకేష్ అవినీతికి ప్పాడ్డారు కాబట్టే అందరికీ భయపడుతున్నారు. అవినీతికి పాల్పడి , బీజేపీకి సాగిలపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు కేంద్రానికి భయపడుతున్నారు కాబట్టే తనపై కేంద్ర ప్రభుత్వం చర్యులు చేపట్టే అవకాశం ఉందని, ప్రజలంతా మద్ధతు తెలపాల ని పదేపదే బహిరంగ సభల్లో కోరుతున్నారన్నారు. నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో జతకట్టిన చంద్రబాబు, ఇప్పుడు ఎన్డీఏపై ప్రజల వ్యతిరేకంగా ఉండటంతో ఆ పార్టీతో తెగతెంపు చేసుకొన్నారన్నారు. పైగా వైసీపీ, బీజేపీతో జతకట్టిందని అసత్య ప్రచారం చేస్తూ ప్రజల ను మభ్య పెడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా టీడీపీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తన వైఫల్యాల ను ఇతర పార్టీల పై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతు, డ్వాక్రా మహిళలు నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంఫీుభావ యాత్రలో తమ సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. టీడీపీ మంత్రులు , శాసనసభ్యుల పై ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న విశాఖలో చాలా దారుణమైన పరిస్థితు నెకొనడానికి కారణం టీడీపీ నేతలేనని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఇప్పటివరకు 160 రోజులు పాటు సాగిన జగన్ ప్రజాసంకల్ప యాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకుందన్నారు. ఈ యాత్రలో ప్రజంతా జననేతకు తమ సమస్యు వినిపిస్తున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతోందని అన్నారు. ప్రజాసంకల్ప యాత్రకు మద్ధతుగా విశాఖలో విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సంఫీుభావ యాత్ర కూడా దిగ్విజయంగా సాగుతోందన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలు తున్నాయన్నారు. జగన్ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. మహిళల పై దాడులు పెరిగాయని, భూ కబ్జాలు అధికమయ్యాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు, దానికి మద్ధతు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సంఫీుభావ యాత్రకు ప్రజ నుంచి విశేషమైన స్పందన లభిస్తోందన్నారు. పార్టీ నగర అధ్యక్షులు మళ్ళా విజయ్ప్రసాద్ మాట్లాడుతూ నగరంలోని నిర్వహించిన సంఫీుభావ యాత్రలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువు, సమన్వయకర్తు లు , నాయకులు రవిరెడ్డి, పక్కి దివాకర్, పోలిరెడ్డి, జాన్వెస్లీ, కొండా రాజీవ్గాంధీ, గరికిన గౌరి, ఫరూఖి, రామన్నపాత్రుడు, షరీప్, బర్గత్ ఆలీ, తదితరలు పాల్గొన్నారు.
సంఫీుభావ యాత్ర సాగిందిలా….
రెండో రోజు సంఫీుభావ యాత్ర మనోరమ థియేటర్ వద్ద గల మసీదు జంక్షన్ నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి అల్లిపురం, డీఆర్ఎం కార్యాయం, పరదేశమ్మ ఆయం, వెంకటరాజు నగర్, సుబ్బక్ష్మి కల్యాణ మండపం, రైల్వే న్యూకాలనీ మసీదు కూడలి, దొండపర్తి ఎరుకుమాంబ ఆలయం వరకు సాగింది. అక్కడ భోజన విరామం తరువాత ద్వారకానగర్ కళా ఆసుపత్రి రోడ్డు, రాజేంద్రనగర్, శ్రీనగర్, అశోక్నగర్, రామాటాకీస్ బజార్, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ జంక్షన్ మీదుగా సాగి పూర్ణామార్కెట్లో ముగిసింది.