ఇండోనేషియాలోని సుంబాదీవిలో భూకంపం సంభవించింది.
కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 5.9గా నమోదైంది.
భూప్రకంపనలతో చర్చి భవనం కూలింది.
ఈ ఘటనలో 34 మంది విద్యార్థులు మృతి చెందగా, 52 మంది గల్లంతయ్యారు.
వెంటనే స్పందించిన అధికారులు గల్లంతైన వారికోసం సహాయక చర్యలను వేగవంతం చేశారు.
ఇటీవల సులవేసే దీవిలో సంభవించిన భూకంపం, సునామీతో 800 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.