ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే లో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ క్లీన్ కార్యక్రమాన్ని వైస్ ఆడ్మిరల్ కరంబీర్ సింగ్ ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఉడా వీసీ బసంత్ కుమార్, జీవియంసీ కమీషనర్ హరినారాయణ్ తో పాటు నేవీ ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ సిటి లో బీచ్ కు ఎంతో ప్రాదాన్యత ఉందని అలాంటిది బీచ్ లో చెత్త తీసి క్లీన్ చేయడం వల్ల మరింత సుందరంగా బీచ్ తయారవుతుందన్నారు. కమాండర్ ఎన్వీరాన్ మెంట్ ఆఫీసర్ విశ్వ రాజేశ్వరీ…క్లీనప్ వల్ల పర్యవరణాన్ని కూడా కాపాడే అవకాశం ఉంది… భవిష్యత్ తరాలవారికి ప్రకృతి ఇదేవిధంగా అంధించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.