నిజాం నవాబు బంగారు టిఫిన్ బాక్స్ను దొంగిలించిన వ్యక్తులు.. మూడు రోజుల పాటు అందులో పుష్టిగా విందారగించారట. కొద్ది రోజుల క్రీతం పాతబస్తీ పురాన హవేలి మ్యూజియంలోని బంగారు టిఫిన్ బాక్స్ చోరీకి గురైన విషయం తెలిసిందే. అయితే దాన్ని పోలీసులు మంగళవారం రికవరీ చేశారు.
అనంతరం కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నిజాం బంగారు టిఫిన్ బాక్సును దొంగిలించిన అనంతరం.. అందులో భోజనం వేసుకుని మూడు రోజులు విందారగించారట. వజ్రాలు పొదిగిన ఆ టిఫిన్ బాక్స్లో ఖరీదైన విందు చేసి సంబరపడి పోయారట. ఈ విషయాన్ని నిందితులు విచారణలో చెప్పారు.
కాగా 10 రోజుల్లో కేసును చేధించిన పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.. గౌస్ పాషా, మహ్మద్ ముబీన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరూ చింతల్ మెట్ ప్రాంతానికి చెందిన వారని తెలిపారు. మ్యూజియం నుంచి బంగారు ఖురాన్ కూడా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని, అయితే ఆ సమయంలోఅజా వినిపించడంతో ఖురాన్ను అక్కడే వదిలేసి పారిపోయారని తెలిపారు. రూఫ్ టాప్ నుంచి క్రిమినల్స్ కిందికి వచ్చి చోరీకి పాల్పడ్డారని పేర్కొన్నారు