దేశ సరిహద్దుల్లో సైనికులు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సరిహద్దు గ్రామాల్లోని మహిళలు సైనికులకు రాఖీలు కట్టారు.
39 ఆర్ఆర్ రేజిమెంట్కు చెందిన ఆర్మీ క్యాంప్కు వెళ్లిన మహిళలు, చిన్నారులు అక్కడ అధికారులు, జవాన్లకు రాఖీలు కట్టి.. వారికి మిఠాయిలు తినిపించారు.
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సేవలు అందిస్తున్న జవాన్లు క్షేమంగా ఉండాలని మహిళలు ఆకాంక్షించారు.
సోదరుడి రక్ష కోరుకోవడమే రాఖీ పరమార్థం. అందుకే కుటుంబాలకు దూరంగా ఉంటున్న జవాన్ల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ మహిళలు రాఖీలు కట్టారు.