కృష్ణా జిల్లా కొండపల్లి ఖిల్లా పై జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.. గత నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కొండపై నుండి ప్రవహిస్తున్న సెలయేర్ల సవ్వడి చూపరులకు ఔరా అనిపిస్తోంది.. ప్రకృతి అందాలకు నిలయమైన కొండపల్లి ఖిల్లా నుండి ఎప్పుడూ లేనంతగా నీటి పరవళ్ల ప్రవాహంతో కొండ క్రింద భాగం సెలయేళ్ళను తలపిస్తున్నాయి.. ఇక్కడికి వచ్చే ప్రకృతి ప్రేమికులు నీటి పరవళ్ళలో కేరింతలు కొడుతూ సందడి చేస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా జలపాతం లో ఆడేందుకు పోటీ పడుతున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈప్రదేశాన్ని ఒక టూరిజం పేరుతో అభివృద్ధి చేయటమే కాకుండా సాహస క్రీడలకు నెలవుగా రూపొందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది