దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానత్వంగా చూడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొండవీటి కోటపై జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయి ఆధ్వర్యంలో భారీ త్రివర్ణపతాకంతో స్వతంత్ర వేడుకలు నిర్వహించారు
అనంతరం వర్షంలో ఉదయం గంటలనుండి గంటలపాటు మౌన దీక్ష చేపట్టారు.
దేశమంతా ఆనందంగా స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో విభజనకు గురైన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయంచేసి విభజన హామీలను అమలుచేయకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు.
హక్కుల సాధనకు గాంధేయ మార్గంలో శాంతి పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు