బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఎయిమ్స్కు ప్రముఖులు తాకిడి పెరిగింది.
వాజ్పేయికి చికిత్స అందిస్తున్న ఎయిమ్స్కు కొద్ది సేపటి క్రితమే ప్రధాని మోదీ చేరుకున్నారు.
వాజ్పేయి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి వైద్యచికిత్సకైనా
వెనుకాడేది లేదని వైద్యులకు చెప్పినట్టు తెలుస్తోంది.
దీనికి ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం ఎయిమ్స్కు వెళ్లి వాజ్పేయిని పరామర్శించారు.
కొద్దికాలంగా వాజ్పేయి కిడ్నీ, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.
బుధవారం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో గురువారంనాడు జరిగే బీజేపీ అధికారిక కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి.
నేతలంతా ఎయిమ్స్కు చేరుకుంటున్నారు.
గత వారం హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం ఎయిమ్స్కు వెళ్లి వాజ్పేయిని పరామర్శించారు.