పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఇసి తేల్చి చెప్పింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా లా కమిషన్కు సోమవారం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయన లా కమిషన్కు లేఖ రాసిన మరుసటిరోజైన మంగళవారం నాడు ఇసి పైవిధంగా స్పందించింది. జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఒపి రావత్ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలకు సరిపడినన్ని వివిపాట్ యంత్రాలు తమ వద్ద లేవని ఆయన పేర్కొన్నారు.