తెలంగాణ ఏర్పాటులో విద్యార్థుల పాత్ర ఎనలేనిదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సరూర్ నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన తెలుగులో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియమకాల కోసం జరిగిందని గుర్తు చేశారు. ఏ కలల కోసం పోరాడామే ఆ కలలు నెరవేలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించిందన్నారు. తెలంగాణ కోసం చాలా మంది అమరులయ్యారన్నారు. లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేసీఆర్ చెప్పారన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. కనీసం 10 వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటివరకు నోటీఫికేన్లు లేవని, రిక్రూట్మెంట్లు లేవని రాహుల్ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పన్నుల విధానంలో సమూల మార్పులు చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
జీఎస్టీ అమల్లో లోపభూయిష్టమైన విధానాల వల్ల చిన్న, మధ్యతరహా సంస్థలు తీవ్రంగా నష్టపోయానని యువ పారిశ్రామిక వేత్తల ప్రత్యేక భేటీలో రాహుల్ పేర్కొన్నారు.
సుమారు గంటన్నరపాటు యువ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన రాహుల్… పారిశ్రామిక విధానాలు, ఉద్యోగ, ఉపాధి కల్పనపై సమగ్రంగా చర్చించారు.
రాహుల్ తో సమావేశమవడం పట్ల పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణకు రావాల్సిన వాటిని సాధించు కోవటం ఇక్కడి ప్రజల హక్కు… ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించుకోవటం అక్కడి ప్రజల హక్కు… రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకొస్తే విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం…” అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సోమవారం తెలంగాణలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకున్న రాహుల్ తొలుత శంషాబాద్లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మహిళా స్వయం సహాయక బృందాలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిం చారు. రెండేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం 15 మంది పారిశ్రామికవేత్తలకు రూ.2.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని, రైతులకు, మహిళలకు స్వయం సహాయక బృందా లకు మాత్రం రుణాలు మాఫీ చేయడం లేదని ఆరోపించారు. తాము అధికారంలోకొస్తే డ్వాక్రా మహిళలే ఉద్యోగాలిచ్చేలా స్వయం సాధికారత సాధించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం శేరిలింగంపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పేరిట తెలంగాణలో రైతుల నుంచి భూములను బలవంతంగా గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఏమయ్యిందని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల కాలంలో కేవలం ఒక్కశాతం మందికి మాత్రమే భూ పంపిణీ చేశారన్నారు. అడవి బిడ్డలైన ఆదివాసీలకు ఇప్పటి వరకూ ఒక్క ఎకరమైనా ఇచ్చారా అని నిలదీశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందన్నారు. తాను ప్రజలకు కాపాలాదారుడినంటూ చెప్పుకున్న మోడీయే.. ఇప్పుడు రాఫెల్ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో హెచ్ఏఎల్ కంపెనీకి రాఫెల్ కాంట్రాక్టునిచ్చామని తెలిపారు. మోడీ అధికారంలోకొచ్చాక ఫ్రాన్స్ వెళ్లి అనిల్ అంబానీకి సదరు కాంట్రాక్టును అప్పగించారన్నారు. అనిల్ అంబానీ ఎప్పుడైనా విమానాలు తయారు చేశారా..? అని ప్రశ్నించారు. పార్లమెంటులో ఇదే విషయాన్ని ప్రశ్సిస్తే ”నా కళ్లల్లోకి చూసి సమాధానం చెప్పలేని ప్రధాని.. దిక్కులు చూస్తూ ఉండిపోయారు…’ అని రాహుల్ అన్నారు. ప్రధాని మోడీ బాటలోనే తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా నడుస్తున్నారన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదని సిఎం కేసీఆర్ను ప్రశ్నించారు. తెలుగు ప్రజల ప్రయోజనాల్ని ఇద్దరు ముఖ్యమంత్రులూ కేంద్రానికి తాకట్టుపెట్టారని ఎపిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. విభజన హామీలు సాధించడంలో ఇద్దరు సిఎంలూ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు