Farmers Raithu Bazar Dharna.in Pandurthi,,Visakhapatnam.Vizag Vision…విశాఖ పెందుర్తి రైతుబజార్ లో రైతులుధర్నకు దిగారు .రైతుబజార్ లో రైతులు విక్రయుస్తున్న ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు ,నిమ్మకాయలు, కొబ్బరికాయలు,పువ్వులు , వంటివాటిని రైతుబజార్ గేటుకు అనుకోని అలాగే పుట్ పాత్ పై అనదికారికంగా విక్రయిస్తున్నవారిపై పెందుర్తి రైతుబజార్ ఏస్టేట్ అధికారి సిహెచ్ . కృష్టమూర్తి పెందుర్తి ట్రాపిక్ పోలీస్ లకు పిర్యాదు చేశారు .పిర్యాధు స్వీకరించిన యస్.ఐ. ఉమామహేశ్వరరావు సంఘటన స్ధలనికి చేరుకోని పుట్ పాత్ ఖళీ చేయించినప్పటికి వారు వెళ్లిన మరుక్షణం యదవిదిగా దుఖణాలను తెరిచారు . రైతులు బజార్ కు 100 మీటర్ల వరుకు ఏటువంటి దుఖణాలు ఉండకూడధన్న నిబందన ఉన్నప్పటి జి.వి.యమ్.సి. క్రిందస్ధాయి సిబ్బంది మామ్ములు తీసుకోని దుఖణా దారులను ప్రోత్సహిస్తున్నారణ ఆరోపణల వినబడుతున్నాయి.అలాగే బయటవ్యాపారాలు జరగటంవలన రైతులుమైన తమకు వ్యాపారాలు లేక కుట్టంబాలు గడవని పరిస్ధితి వస్తున్నాయని వాపోయారు.అలాగే నిత్యం కూరగాయలు కోనుగిొలు చేసుకోవడానికి వచ్చే వినియోగదారులకు సరియైన పార్కింగ్ స్ధలం లేకపోవడం ఉన్న పుట్ పాత్ పై ధుకాణధారులు వల్ల తరుచు ఎక్స్డెంట్ వంటివి జరగడం పరిపాటిగా మారింది . ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి రైతుబజార్ బయట దుఖణాలు తీసివెసి రైతులకు న్యాయం చేస్తారని కోరుతున్నారు