పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అవిశ్వాసంపై చర్చలో భాగంగా అప్పటివరకూ మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ ప్రసంగం ముగించే ముందు మోదీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. మోదీ కూడా నవ్వుతూ రాహుల్ను పలకరించి.. భుజం తట్టారు. రాజకీయ ప్రత్యర్థులైనా వీరిద్దరూ ఇలా ఆప్యాయంగా పలకరించుకోవడం చూసిన ఎంపీలంతా షాక్కు గురయ్యారు. ‘నా మీద మీలో కోపం, ద్వేషం ఉన్నాయి. నేను వాటిని తొలగిస్తా’ అంటూ ప్రధాని మోదీ దగ్గరికి రాహల్ వెళ్లారు. ప్రధాని మోదీకి షేక్హ్యాండ్ ఇచ్చి అలింగనం చేసుకున్నారు. ఊహించని రాహుల్ చర్యతో ప్రధాని మోదీ అవాక్కయ్యారు..