Burma Kandishikki should be given justice Demanded by YSRCP Visakhapatnam,Vizag Vision..దశాబ్దాల కాలం గా నగరంలో నివసిస్తున్న బర్మా కాంధీశీకుళకు ప్రభుత్వం తక్షణ న్యాయం చేకూర్చాలని వైసీపీ విశాఖ నగర అధ్యక్షుడు మళ్ళ విజయ్ప్రసాద్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాల ని కోరుతూ బర్మా కాంధీశీకు పునరావాస సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కప్పరాడ వైభవ వెంకటేశ్వరస్వామి అలయ కూడలిలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి, మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ప్రసాద్ మాట్లాడుతూ బర్మా కాంధీశీకుకు గృహ వసతి లేక అనేక ఇబ్బందును ఎదుర్కొంటున్నారన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 38వ వార్డులో వారి కోసం ఆ నాడు నోటిఫికేషన్ ఇచ్చి 9.5 ఎకరాల భూమిని కేటాయించారన్నారు. అందులో సుమారు ఆరు ఎకరాు 300 మందికి కేటాయించారన్నారు. మిగతా మూడున్నర ఎకరాల్లో రెండు ఎకరాలు కబ్జాకు గురైందన్నారు. మిగిలిన ఒకటిన్నర ఎకరాల్లో టిడ్కో ద్వారా 160 మంది బర్మా కాంధీశీకులకు గృహవసతి కల్పించాని ఉత్తర్వళు జారీచేసిందన్నారు. అయితే దానిని కూడా భూకబ్జాదాయి అడ్డుకుంటున్నారని, నకిలీ పత్రాతో ఆ భూమిని కూడా కబ్జాచేయాని చూస్తున్నారని ఆరోపించారు. వీరికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహాయ, సహకారాు అందజేస్తున్నారని ఆరోపించారు. గత ఆరు రోజుగా బర్మా కాంధిశీకుల నిరాహార దీక్ష చేస్తున్న సమాధానం చెప్పకుండా ఉన్నారంటే అధికారులు ఏమి లాూచీ పడ్డారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే బర్మా కాంధిశీకులను ఆదుకుంటామని, వారి సమస్యన్ని పరిష్కరించే విధంగా జగన్ దృష్టికి తీసుకెళ్తామని విజయ్ ప్రసాద్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బర్మా కాంధిశీకుల సమస్యు పరిష్కరించకపోతే వారితో కలిసి వైసీపీ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు