దేశ వ్యాప్తంగా మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆధ్వర్యంలో నడిచే చైల్డ్ కేర్ హోమ్స్లపై విచారణ జరపాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో చిన్న పిల్లలను అక్రమంగా విక్రయించిన ఘటన వెలుగు చూడడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆధ్వర్యంలో నడిచే చైల్డ్ కేర్ హోమ్స్పై తక్షణమే విచారణ జరిపించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది.
అంతేకాదు.. రాష్ట్రాల్లోని అన్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లను సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీకి లింక్ చేయాలంది.
ఈ ప్రక్రియ అంతా నెలలోనే ముగిసేలా చూడాలని ఆదేశించింది.